CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏ.ఎన్.ఎస్.దీక్షలకు మద్దతుగా నిలిచిన ముర్రవానిగూడెం ఆదివాసీలు 1/70 చట్టం పటిష్ట అమలు కు చర్యలేవి..ఏ. ఎన్ .ఎస్ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు పోలేబోయిన భార్గవ్.

Share it:



  •  ఏ.ఎన్.ఎస్.దీక్షలకు మద్దతుగా నిలిచిన ముర్రవానిగూడెం ఆదివాసీలు
  • 1/70 చట్టం పటిష్ట అమలు కు చర్యలేవి..ఏ. ఎన్ .ఎస్ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు పోలేబోయిన భార్గవ్.                                              

మన్యం మనుగడ వెంకటాపురం ఆగస్టు 29.                      

    ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో గత 7 రోజులుగా దీక్షలు చేస్తున్న అధికారుల్లో ఎటువంటి చలనం లేదని ఏ.ఎన్.ఎస్ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు పోలేబోయిన భార్గవ్ ఆరోపించారు.  పెసా,1/70 చట్టానికి విరుద్ధంగా వలస గిరిజనేతరులు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న మండల పంచాయతి అధికారి,రెవెన్యూ శాఖ అధికారులు నిద్రపోతున్నారా అని ఆయన అన్నారు. చట్టాలు అమలు చేయాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న అధికారుల్లో చలనం లేదన్నారు.వెంకటాపురం రెవిన్యూ,పంచాయితీ అధికారుల్లో ఆదివాసీ చట్టాల పై అవగాహన లేదన్నారు.ఏజెన్సీ చట్టాలు పూర్తిగా నిరివీర్యం కావడానికి రెవిన్యూ,పంచాయితీ అధికారుల నిర్లక్ష్యం అన్నారు.గిరిజన చట్టాలతో గెలుపొందిన ఆదివాసీ ప్రజా ప్రతినిధులు ఆదివాసీ ఉద్యమానికి దూరంగా ఉండడం దుర్మార్గమైన విధానం అన్నారు.ఆదివాసీ ప్రజాప్రతినిధులను ఆదివాసీ సమాజం ప్రశ్నించే రోజు రాబోతుందన్నారు.వెంకటాపురం రెవిన్యూ,పంచాయితీ అధికారులు తూ తూ మంత్ర విధానంతో ఆదివాసీ చట్టాలు అమలుచేయకుండా ఆదివాసీ సమాజాన్ని మభ్యపెడుతున్నారు అన్నారు.ఆదివాసీ నవ నిర్మాణ సేన ఆదివాసీ చట్టాలు పటిష్ట అమలు అయ్యే అంత వరకు జాతి మేల్కొలుపుతూ ఉద్యమ కార్యచరణతో ముందుకు పోతుందన్నారు.మండల పంచాయితీ అధికారులు పెసా,1/70 చట్టం అమలులో పూర్తిగా వ్యతిరేక విదానాలు అమలు పర్చుతున్నారు అన్నారు.ఏజెన్సీ నుండి వలస గిరిజనేతరులు వెళ్లిపోవాలని ఆదివాసీ సమాజం గట్టి ఉద్యమం చేపట్టబోతుందన్నారు.ఈ కార్యక్రమంలో అడివాసినవనిర్మాణ సేన ఉపసర్పంచ్ ఇరప రవి, ఆదివాసీ నవనిర్మాణ విద్యార్థి సేన జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్, ఆదివాసీ మండల ఉపాధ్యక్షులు రాజేష్,వార్డ్ మెంబెర్ కుర్షం రాంబాబు,మడకం బీ మయ్య, మొర్రవాని గూడెం ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: