CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలవరం ముంపు ప్రాంతం గా నెల్లిపాక పంచాయితీ ని ప్రకటించాలి

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి అశ్వాపురం: అశ్వాపురం మండలం లోని నెల్లిపాక పంచాయితీ ని పోలవరం ముంపు ప్రాంతం గా ప్రకటించి పోలవరం ప్యాకేజీ అందించాలని కోరుతూ సోమవారం కొత్తగూడెం  కలెక్టర్ కార్యాలయం లో జరిగే ప్రజావాణి కార్యక్రమం లో నెల్లిపాక పంచాయితీ ప్రజలు కలెక్టర్ ను కలిసి దరఖాస్తు అందచేశారు.గత నెలలో వచ్చిన గోదావారి వరదల కారణం గా మండలం లోని నెల్లిపాక పంచాయితీ లోని మూడు గ్రామాలు పూర్తిస్థాయిలో నాలుగు రోజులపాటు నీటమునిగి ఉండటం తో ఇళ్లలోని దుస్తులు, వంటసామాగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు, పూర్తిగా గోదావరి వరదలకు కొట్టుకపోయినాయని కలెక్టర్ కు గ్రామస్థులు తెలియచేశారు.గత నెలలో వచ్చిన గోదావరి వరద అంతటి బీభత్సం సృష్టించడం గల కారణం తెలంగాణ ప్రక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో నిర్మాణం  అవుతున్న పోలవరం ప్రాజెక్టు కు సంబంధించిన బ్యాక్ వాటర్ వలన ఇంతటి వరదలు వచ్చాయని, పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే మా నెల్లిపాక పంచాయితీ పూర్తిగా వరద నీటిలో ఉంటుందని కలెక్టర్ కు గ్రామస్థులు వివరించారు. కావున పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం గా నెల్లిపాక పంచాయితీ ని ప్రకటించి, పోలవరం ప్యాకేజీ అందించి, సురక్షిత ప్రాంతం లో పక్కా ఇల్లులు కట్టించి మమ్ములను ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. స్పందించిన కలెక్టర్ ఈ సమస్య ను తెలంగాణ ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకవేలతానని, అట్టి విషయం లో పూర్తి స్థాయి లో వరద బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారని గ్రామస్థులు అన్నారు. ఈ కార్యక్రమం లో వరద బాధిత గ్రామస్థులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: