మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా క్రీడా దినోత్సవం వేడుకలు జరిగాయి. క్రీడా దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథులుగా అటవీ శాఖ రేంజర్ శ్రీనివాసరావు, ఎంఈఓ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ రేంజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ... క్రీడల ద్వారా శారీరక, మానసిక, ఉల్లాసం కలుగుతుందన్నారు. మంచి క్రీడాకారులు ఉన్న పాఠశాల జిల్లా,రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. క్రీడల ద్వారా మంచి భవిష్యత్తు, ఉపాధి,ఉద్యోగ అవకాశాలు పొందవచ్చాన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఆనంద్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: