మన్యం మనుగడ, అశ్వారావుపేట: స్వాతంత్ర్య ధ్విసాప్తహం వేడుకలలో భాగంగా అంగన్వాడీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు అశ్వారావుపేట అమ్మ సేవా సదనం నందు వృద్దులకు, అలాగే ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న పేషెంట్లకు 101 మందికి ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి చేతులమీదుగా పండ్లు, బ్రెడ్, స్వీట్లు, బిస్కెట్లు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టిన స్వాతంత్ర్య వేడుకలలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగానే ఈరోజు వృద్ధాశ్రమంలో, హాస్పటల్ లో ఈ పండ్లూ బ్రేడ్ స్వీట్లు పంపిణీ చేయటం చాలా సంతోషంగా ఉందని, అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు సర్పంచ్ అట్టం రమ్య, తహసిల్దార్ చల్లా ప్రసాద్, సీడీపీఓ రోజారాణి, సూపర్వైజర్ విజయలక్ష్మి, సౌజన్య, పద్మావతి, డాక్టర్ వెంకటేశ్వర్లు, నార్లపాటి రాములు, పసుపులేటి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: