మన్యం మనగడ వాజేడు జూలై 24:. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాజేడు మండలంలో పలు గ్రామాలు గోదావరి పరివాహక ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలైన గుమ్మడిదొడ్డి, గ్రామం పూర్తిగా జరమేమయ్యాయి, కనీస నిత్యవసర సరుకులు వినియోగించుకోలేని పరిస్థితులలో సర్వం కోల్పోయి, కష్టాల్లో ఉన్న ముంపు బాధితులకు మేమున్నాం అంటూ టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నియోజకవర్గం ఇంచార్జ్ తెల్లం వెంకటరావు,నుగూరు వెంకటాపురం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బోదే బోయిన బుచ్చయ్య. దాతల సహాయంతో గుమ్మడిదొడ్డి పంచాయతీలో పలు గ్రామాల ప్రజలు కు స్థానిక సర్పంచ్ పాయం విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలసాని, మాట్లాడుతూ ముంపు బాధితులను టిఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకుంటుందని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తల్లడి పుష్పలత ,ఎంపీపీ శ్యామల శారద, టి ఆర్ ఎస్ పార్టీ, మండల అధ్యక్షులు,పెనుమల్ల రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి,సోమిడి,నర్సింహ రావు, సర్పంచ్ మడకం బెనిని, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: