మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: వరద బాధిత కుటుంబాలకు అండగా ఉండాలనే ఆలోచన రావడం గొప్పవిషయమని మండల విద్యాశాఖధికారి సత్యనారాయణ అన్నారు. అన్నపురెడ్డిపల్లి,చండ్రుగొండ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు రూ.1 లక్ష, క్వింటా బియాన్ని దుమ్ముగూడెం మండలం లోని లక్ష్మీనారాయణపేట గ్రామానికి చెందిన వరద బాధిత కుటుంబాలకు ఎంఈఓ సత్యనారాయణ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉండటం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం ఎంఈఓ సమ్మయ్య ఉపాధ్యాయులు ఇస్లావత్ వీరన్న, దేవరామ్, రవి,ఆపిర్ హుస్సేన్, శ్రీనివాస్, రాములు, భాస్కర్ నాయక్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: