మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: రాష్ట్ర మంత్రి కేటీఆర్ మంచికి మారుపేరు అని, ఆయన నాయకత్వంలో ఐటీ రంగం ముందుకు పోతుందని టిఆర్ఎస్ మండల అధ్యక్షులు,ఎంపీటీసీ దారా బాబు అన్నారు.ఆదివారం టిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో పండ్లు,బ్రెడ్డు ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా దారా బాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో కేటీఆర్ నాయకత్వంలో పరిశ్రమలో ఎన్నో స్థాపించబడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మేడ మోహన్ రావు, చీదెళ్ళ పవన్ కుమార్, గుగులోత్ రమేష్, ఉన్నం నాగరాజు, సత్తి నాగేశ్వరరావు, మద్దిరాల చిన్నపిచ్చయ్య, మల్లెం వెంకటేశ్వర్లు, సూర వెంకటేశ్వర్లు, వంకాయలపాటి బాబురావు, గూగులోత్ శ్రీనివాస్ నాయక్, చాపలమడుగు రామరాజు, సుంకర రామారావు, షేక్ ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: