CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అన్నదాతలూ ..అధైర్య పడకండి మీకు అండగా ఉంటా..జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

Share it:


  • రూ రెండు లక్షల విలువైన వరి విత్తనాలు పంట నష్టపోయిన రైతులకు ఉచితంగా పంపిణీ...
  •  ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న నాసిరెడ్డి....

మన్యం మనుగడ, మంగపేట.

గోదావరి వరద ముంపుకు గురైన అన్నదాతలు అధైర్యపడవద్దని వారికి అండగా నేనుంటానని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు ఆదివారం మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామంలో వికాస్ అగ్రి పౌండేషన్ కార్యాలయ ప్రాంగణంలో అకినేపల్లి మల్లారం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ కొత్తగూడెం గ్రామాలలో ఇటీవల గోదావరి వరదల వల్ల వరి నారుమడులు పూర్తిగా నష్టపోయిన  రైతులకు రూపాయలు రెండు లక్షల విలువైన వరి విత్తనాల సంచులను సాంబశివరెడ్డి ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ వరంగల్ లోని పలు విత్తన సంస్థలను కలిసి గోదావరి ముంపు వల్ల జరిగిన పంట నష్టాన్ని తాను వివరించడంతో వారు స్పందించి 200 ఎకరాల కు సరిపడా సీడ్ ప్యాకెట్లను వితరణగా అందజేయడం జరిగిందని వాటిని ఈరోజు వాస్తవంగా పంట నష్టపోయిన రైతులను గుర్తించి విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు ఇందుకు సహకరించిన అన్నపూర్ణ సీడ్స్ చందుపట్ల వేణుగోపాల్ రెడ్డి శ్రీ లక్ష్మీ సీడ్స్ ప్రతాప్ రెడ్డి కర్షక్ సీడ్స్ వేణుగోపాల్ రెడ్డి శ్రీ కిన్నెర సీడ్స్ జగన్మోహన్ రావు కిన్నెర సీడ్స్ సొననబోయిన మొగిలి తదితరులను ఆయన అభినందిస్తూ రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆర్ ఎన్ ఆర్ 15048 తెలంగాణ సోనా ఎం టు యు 12 24  ఆమన్  బిపిటి 5204 మొదలైన వరి వంగడాలను ఈరోజు రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు వరి సాగు చేసే రైతులు లోతట్టు ముంపు ప్రాంతాల్లో కాకుండా వెంటనే మెరక ప్రాంతంలో నారు మడులు విత్తుకోవాలని సాంబశివరెడ్డి సూచించారు నారుమడులు నష్టపోయిన రైతాంగానికి సీడ్ విత్తనాలతో పాటు నారు మడి యాజమాన్యం కోసం రూపాయలు 50,000 విలువైన సూక్ష్మ పోషక ఎరువుల కిట్లు సైతం రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు సాంబశివరెడ్డి తెలిపారు విత్తన ఉత్పత్తిలో మేటి గా ఉన్న ఆకినేపల్లి మల్లారం గ్రామంలో మూడు దశాబ్దాలుగా ఎప్పుడు లేని విధంగా ఇంతటి వరద విపత్తు జరగటం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతు సోదరులు ఎవరు కూడా మనో ధైర్యం కోల్పోవద్దని సాంబశివరెడ్డి రైతులను కోరారు ఈ కార్యక్రమంలో  రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ షేక్ మదర్ సాహెబ్ రైతులు జాడీ ప్రసాద్ తొండపు సంజీవరెడ్డి గాదె నరేందర్ శ్రీనివాస్  వెంకటేశ్వర్లు రాజు షేక్ మోయునుద్దేన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: