మన్యం టీవీ దుమ్ముగూడెం ::
గోదావరి వరదల కారణంగా అత్యంత ఈనంగా తయారైన సున్నం బట్టి గ్రామాన్ని బాధితులకు భరోసా కల్పించి, ముంపు ప్రాంతాన్ని సందర్శించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్. గోదావరి వరద ముంపు నుంచి ఇంకా గ్రామం బయటపడకపోవడంతో పడవలో వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. వరద పూర్తిగా తగ్గి పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే వరకు ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఉండాలని సూచించారు. విద్యుత్ సరఫరా జరిగే వరకు పునరావాస కేంద్రాల్లో ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు కలెక్టర్ వారి సమస్యలు వినిపించుకుందుండగా ఒక మహిళ బాధితురాలు చేతులు జోడించి మమ్మల్ని ఆదుకోండి సార్ అని వేడుకుంటూ కన్నీరు పెట్టుకుంది గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి మాకు శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు కోరారు. కలెక్టర్ వారికి ధైర్యం చెప్పు ప్రభుత్వం ఇచ్చే పదివేల రూపాయలు సాయంతో పాటు పున్నమిపెట్టి గ్రామానికి స్పెషల్ ప్యాకేజీ కింద ఆర్థిక సాయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, పూర్తిగా గోదావరి తగ్గేవరకు ప్రజలు గ్రామానికి వెళ్లకుండా రక్షణగా బారికేడింగ్ ఏర్పాటు చేసి పోలీస్ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రామం మొత్తం పారిశుద్ధ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అనంతరం లక్ష్మీ నగరం పునరావస కేంద్రాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి మరియన్న, ఆర్డిఓ కిశోర్ బాబు, తహసిల్దార్ చంద్రశేఖర, ఎంపీడీవో చంద్రమౌళి జెడ్పిటిసి సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: