మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: మావోయిస్టు పార్టీ వారోత్సవాలు రేపటినుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అశ్వాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై నాగులు మీరా ఖాన్ విస్తృత తనిఖీలను చేపట్టారు. మండల కేంద్రానికి నలుమూలల ఉన్న రహదారులలో సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేశారు. సిబ్బందితో కలిసి మండలంలోని పలు గ్రామాలను సందర్శించి మావోయిస్టు పార్టీకి ఎవరు సహకరించవద్దని గ్రామస్తులకు సూచించారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా గ్రామాల్లో సందర్శిస్తే పోలీస్ శాఖ వారికి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: