మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ మండల మైనారిటీ అధ్యక్షులు షేక్ నయీమ్ భార్య ముంతాజ్ ఆరోగ్య పరమైన సమస్యలతో బాధపడుతున్నారు. అదే విధంగా అశ్వాపురం మండలం అమెర్థ గ్రామానికి షేక్ జాన్ పాషా రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యారు. ఇట్టి విషయాలను తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు పెద్ద మనుసుతో ఆలోచించి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇద్దరికీ చేరి పది వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సినియర్ నాయకులు ఆవుల నర్సన్న, పినపాక నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు మట్టపల్లి సాగర్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బోశెట్టి రవి, ప్రధాన కార్యదర్శి గుర్రం స్రుజన్, బానోత్ రమేష్, నజీర్ షోను, మహేష్, మోదుగు వంశీ, వెంకట్ చౌదరి, కండె దేవెందర్, రవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: