మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని నరసాపురం గ్రామంలో పేకాట స్థావరం పై దుమ్ముగూడెం ఎస్ఐ కేశవ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పేకాట స్థావరంపై మెరుపుధాడి చేశారు పేకాట ఆడుతున్న వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా వారిని వెంబడించి ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 3400 rs నగదు,4 మోటార్ సైకిళ్ళు,పేకముక్కలు లను స్వాధీనం చేసుకున్నారు మరో 12 మంది వ్యక్తులు దొరకకుండా పారిపోగా మొత్తం 14 మంది పై కేసు నమోదు చేసారు. లక్ష్మి నగరం గ్రామంలో కోడిపందాల ఆడుతున్నారన్న పక్క సమాచారం తో కోడిపందాలు ఆడుతున్న వారిపై దాడి చెయ్యగా వారు పోలీస్ వారని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని వెంబడించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి నగదు, కోడిపుంజు, కత్తులును స్వాధీనం చేసుకున్నారు మరో 7 గురు వ్యక్తులు దొరకకుండా పారిపోగా మొత్తం 9 మంది పై దుమ్ముగూడెం సి ఐ ఆదేశాల మేరకు ఎస్ ఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: