CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వరద బాధితులకు అండగా తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ముంపు ప్రాంత బాధితులకు నిత్యాసర సరుకులు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Share it:

 * 


మన్యం మనుగడ ప్రతినిధి, బూర్గంపహాడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడు మండలం ఇరవెండి, మోతే గ్రామపంచాయతీలలో గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు తాళ్లూరి పంచాక్షరయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 600 కుటుంబాలకు అందించిన పలు రకాల నిత్యావసర సరుకులను, నూతన వస్త్రాలను బాధిత కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాళ్లూరి పంచాక్షరయ్య చారుటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మనకి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కిట్లు పంపిణీ చేశారని, అదేవిధంగా వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు నూతన వస్త్రాలను తాళ్లూరి పంచాక్షరయ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగాగోదావరి వరద బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. వరద ముంపు గ్రామాలలో ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు రెండు నెలల పాటు 20 కేజీల బియ్యం నిత్యవసర సరుకులు అందజేయడం జరుగుతుందన్నారు.పినపాక నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ తరపున 10 కేజీల బియ్యం కేజీ నూనె పసుపు కారం తోపాటుగా పలు రకాల నిత్యవసర సరుకులు వరద బాధిత కుటుంబానికి నేరుగా ఇంటికెళ్లి అందజేస్తామన్నారు.ప్రతి కుటుంబానికి సహాయం అందుతుందని అన్నారు, సర్వే బృందాలు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాల వివరాలు సేకరించామన్నారు.ముంపు ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు టిఆర్ఎస్ పార్టీ తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి భరోసా కల్పించారు.మీ కష్టాల్లో తోడుగా ఉంటా ఎటువంటి సమస్యలున్నంతన్న దృష్టికి తీసుకురావాలని సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో తాళ్లూరి పంచాక్షరి ట్రస్ట్ అధ్యక్షులు తాళ్లూరి పంచాక్షరయ్య, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ కొరసా లక్ష్మి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, గ్రామపంచాయతీల సర్పంచులు, వార్డ్ మెంబర్లు,గ్రామ ప్రజలు, మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: