CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వీఆర్ఏల నిర్వాధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.

Share it:

 


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండల తాహాసిల్దార్ కార్యాలయం ముందు తమ న్యాయమైన కోరికలను వెంటనే నెరవేర్చాలని వీఆర్ఏలు నిర్వాధిక సమ్మె చేపట్టిన విషియం తెలిసిందే దానిలో భాగంగా అశ్వరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొగళ్ళపు చెన్నకేశవరావు మాట్లాడుతూ వీఆర్ఏలుకు ముఖ్యమంత్రి ఇచ్చిన న్యాయమైన కోర్కెలను తీర్చాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ సాక్షిగా 09/09/2020 నాడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను విడుదల చేసి, వెంటనే అమలు చేయాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలని అన్నారు, వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు మరియు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు, వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చ వరకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలియజేశారు వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు తాహసిల్దార్ కార్యాలయం ముందు నిరవదిక సమ్మె చేపడతామని వీఆర్ఏల జేఏసీల కమిటీ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు దాసరి శ్రీనివాసరావు. ఊకే రమేష్ చిలకారావు, సత్యనారాయణ, జక్కుల ఏసు, బానోతు నాగరాణి, జొన్నలగడ్డ నాగేష్. వెంకటేశ్వర్లు, రాము, చిట్టెమ్మ అశ్వరావుపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొగళ్ళపు చెన్నకేశవరావు, నియోజకవర్గ నాయకురాలు వగ్గెల పూజ, ఎంపీటీసీ సత్యవరపు తిరుమల, తుమ్మ రాంబాబు, మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కే పాషా, బండారు మహేష్, జల్లిపల్లి దేవరాజు, నరదల సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: