CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వపాఠశాలలోనే నాణ్యమైన విద్య..

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎంపీటీసీ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారా బాబు అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ప్రభుత్వం నుండి వచ్చిన ఏకరూప దుస్తులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు,శిక్షణ పొందిన ఉపాధ్యాయుల చేత విద్యాబోధన,ప్రతి ఏడాది రెండు జతల దుస్తులు, ఉచితంగా పుస్తకాలు, ఎటువంటి ఫీజులు వసూలు చేయడం జరగదన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖధికారి సత్యనారాయణ, జడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, హెచ్ ఎం ఆనంద్, ఉపాధ్యాయులు మంజుశ్రీ, నరసింహారావు, రాజశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: