CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దమ్మపేటలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు ప్రారంభం.

Share it:

  


దమ్మపేట జులై 27 ( మన్యం మనుగడ ) : సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దమ్మపేటలో లేక అశ్వరావుపేటలో జ్యుడీషియల్ ఫఘ్ట క్లాస్ మెజీస్రేట్ న్యాయస్థానం నెలకొల్పాలని ఆర్టీవో కార్యాలయం సబ్ రిజిస్టర్ కార్యాలయం డిఎస్పి కార్యాలయం జూనియర్ కాలేజీ తక్షణం ఏర్పాటు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరంతర రిలే నిరాహార దీక్షలను సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో సత్తుపల్లిలో ఈ సౌకర్యాలు ఉండేవని జిల్లా విభజనలో కొత్తగూడెం జిల్లాలోకి రావడం వలన ఈ కార్యాలయాలన్నీ కొత్తగూడెంలో ఉండటం వలన అశ్వరావుపేట దమ్మపేట ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని సరైన బస్సు సౌకర్యం లేదని సామాన్య ప్రజలు 150 కిలోమీటర్లు వెళ్లి రావాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కార్యాలయాలను ఈ రెండు మండలాల్లో ఒక చోట నెలకొల్పాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుందని ఈ కార్యాలయాలు నెలకొల్పే వరకు నిరంతర రీలే నిరాహార దీక్షలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలిపినారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పండూరి వీరబాబు సహాయ కార్యదర్శి సుంకు పాక ధర్మ మహిళా సమాఖ్య కార్యదర్శి జానీ బేగం ,తుపాకుల శాంతి, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి బత్తుల సాయి ,ఏఐటియుసి కార్యదర్శి బెజవాడ రాము ,నక్క నాగమణి ,జాన్ బి ,గాజు బోయిన కృష్ణవేణి ,సుజాత, రాధిక, సమత ,పుష్ప ,నల్ల ప్రసాదు ,తోట శ్రీను తదితరులు దీక్షలో పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: