మన్యం మనుగడ, అశ్వారావుపేట:ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజ సంక్షేమం కోసం నియోజక వర్గ ప్రజలకు, అధికారాలకు అశ్వరావుపేట నియోజక వర్గ ఎంఎల్ఎ మెచ్చా నాగేశ్వరావు పలు సూచనలు, సలహాలు ఇచ్చి సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. మంగళవారం అశ్వారావుపేట క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలోని అన్ని శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ ఏర్పాటు చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అశ్వారావుపేట మండల తహిసీల్దార్ కి పలు సూచనలు చేశారు. నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలపై పరిస్థితులను 5 మండలలో ఉన్న అన్ని శాఖల అధికారుల నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉన్నారనీ తెలిపారు. అన్ని శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు సహాయక చర్యలు చేపడుతూ ప్రజలకు అందుబాటులో అభ్యర్ధించారు. శిథిలావస్థ ఇళ్లలో ఉన్న వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చెయ్యండని అధికారులను ఆదేశించారు. మురుగునీటి కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయ్యండని సూచించారు. రోడ్ల మీద నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.
Navigation
Post A Comment: