మన్యం మనుగడ కరకగూడెం: మండలంలోని సిపిఎం పార్టీ ముఖ్య నాయకులు భద్రాచలం ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం. వీరయ్య సమక్షంలో చేరినట్లు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనం అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు ఆరోపించారు. జూలై 11న జరిగిన చేరికలలో సిపిఎం పార్టీకి చెందినవారు ఎవరు ఎంతమంది ఉన్నారో, పేర్లు, ఫోటోలతో సహా నిరూపించాలని ఈ సందర్భంగా వారికి సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయిందని ప్రజలు నమ్మే స్థితిలో లేదని, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల బాగోగులు ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని,తద్వారాన్నే దేశంలో ప్రజా సమస్యలు కుప్పలు తెప్పలుగా పోగై పేదరికం నిరుద్యోగంతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని అందుకనే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిందని వారన్నారు. ప్రజా సమస్యల పట్ల అంకితభావంతో పనిచేసే సిపిఎం పార్టీ యెడల అబూత కల్పనలు తప్పుడు ప్రచారాలను జనంలోకి తీసుకెళ్లాలని చూస్తే ఊరుకునేది లేదని వారన్నారు. పదవుల కోసం పార్టీ మారే నైజం సిపిఎం పార్టీ కార్యకర్తలది కాదని ఎవరు,ఏ పార్టీ వారో తెలియకుండానే ఎలా పత్రిక ప్రకటన ఇస్తారని,ఈ పద్ధతి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సిపిఎం పార్టీ పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటించిన కుంజా జోగయ్యకు సిపిఎం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆ పేరు గల వ్యక్తి సిపిఎం పార్టీలోనే లేరని, ఆ వ్యక్తి ఎవరో సిపిఎం పార్టీకి తెలవదని,అతను ఎవరో కాంగ్రెస్ పార్టీ వారే చెప్పాలని అతను కనీసం పార్టీ సానుభూతిపరుడు కూడా కాదని,ఎటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క చిల్లర రాజకీయాలకు నిదర్శనం అన్నారు రానున్న రోజుల్లో బిజెపి కాంగ్రెస్ పార్టీలను ఓడించేందుకు కంకణ బద్ధులుగా పని చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చర్ప.సత్యం, ఊకె నరసింహారావు,తాటి సతీష్,వెంకట్ లు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: