CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎస్సీ కాలనీలో పర్యటించి, ప్రజల సమస్యలు పరిష్కరించిన అశ్వాపురం మండల తెరాస పార్టీ అధ్యక్షులు.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు గ్రామపంచాయతీలోని ఎస్సీ కాలనీలో గత వారం గా కురుస్తున్న వర్షాల కారణంగా సైడ్ డ్రైన్ కాలువలు పూర్తిగా బ్లాక్ అవ్వడం తో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్న క్రమంలో అశ్వాపురం మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ జెసిబి సహాయంతో సైడ్ డ్రైన్లను క్లియర్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ,గత 3,4 రోజుల వర్షలు పడుతున్న నేపధ్యంలో గోదావరి సుమారు 62 - 65 అడుగులకి చేరుకునే అవకాశం ఉంది అని తెలిపారు.గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండి. పునరావృత ప్రాంతాలకు తరలి రావాలని కోరారు. విరామం లేకుండా వర్షాలు కురుస్తున్నందునా ప్రజలను అధికారులను అప్రమత్తం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు, ఎలాంటి సమస్య వచ్చిన అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లెలమడుగు గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: