మన్యం మనుగడ వాజేడు జూలై 13:
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురవడం వల్ల గోదావరి పరివాహ ప్రాంతాలలో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో వాజేడు మండలం చెరుకూరు పంచాయతీ శ్రీరాంనగర్ గ్రామం పల్లపుప్రాంతాలకు చేరి గ్రామం లో ఎస్సీ కాలనీ చుట్టూ నీరు చేరి ప్రజలకు అంతరాయం ఏర్పడింది, ఈ విషయాన్ని తెలుకున్న. సెక్రటరీ శ్రీకాంత్, సర్పంచ్ అనంతలక్ష్మి జె. సీ. బి తో. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందస్తుగా చిన్న చిన్న గుంటలలో నిల్వ ఉండి లార్వా లాంటి క్రీములు మానవ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశలు ఉన్నాయని గ్రహించి, వాటాన్నింటిని కలుపుకొని డ్రైనేజీ లాగ జె. సీ. బి తో కాలువలు తీయించారు. పంచాయతీ పరిధి ఏ సమస్యలు ఉన్న సర్పంచ్, సెక్రటరీ దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని వారు పేర్కొన్నారు.
Post A Comment: