CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి.సామాన్యుల పై పెను భారంగా వంట గ్యాస్

Share it:



కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై బుధవారం పెంచినటువంటి 50 రూపాయలను వెంటనే తగ్గించాలి అని టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.బిజెపి ప్రభుత్వం నిత్యావసరాలు అయినటువంటి గ్యాస్,పెట్రోల్, వంటసరుకు ధరలను ఇష్టానురితంగా పెంచుకుంటూ, సామాన్య మానవులపై ధరల రూపంలో అధిక భారం వేస్తూ, పేద ప్రజల నడ్డి విరుస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిత్యవసరల ధరలు పేద ప్రజలకు అందని ద్రాక్షగా తయారయ్యాయి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి వలన,ఏకపక్ష నిర్ణయాల వలన సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అన్నారు.ఇటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ మొండి వైఖరిని నిరసిస్తూ,సామాన్య ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు కేంద్రం మొండి వైఖరి విడనాడే వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది అని తెలిపారు.ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు మండల తహసీల్దార్, కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ నాగరాజుకు వినతి పత్రం అందజేసిన మణుగూరు మండల జడ్పిటిసి పొశం. నరసింహారావు,ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు,స్థానిక ప్రజాప్రతినిధులు,ప్రబుదాస్, పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,బీసీ సెల్ అధ్యక్షులు అడపా వెంకటేశ్వర్లు,మైనారిటీ అధ్యక్షులు హాబీబ్,నాయకులు శ్రీను,ప్రసాద్,రామకోటి,యువజన నాయకులు,మహిళ అధ్యక్షులు చంద్రకళ, రమాదేవి,మహిళ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: