మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలంలోని ములకపాడు అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత బంధు లబ్ధిదారులు నిరసన కార్యక్రమం చేశారు భద్రాచల నియోజకవర్గానికి చెందిన మూడు మండలాల దళిత బంధు లబ్ధిదారులు 60 మంది భద్రాచలం, దుమ్ముగూడెం,చర్ల నాలుగు నెలలకాలంగా లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేయకుండా ప్రభుత్వ ఉన్నతాధికారులు జాప్యం చేస్తూ వస్తున్నారు అని ఆవేదన చెందారు ఇదే భద్రాచల ఎమ్మెల్యే పోదెం వీరయ్య లెటర్ ప్యాడ్ పై ఎంపికచేసిన వాజేడు వెంకటాపురానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు ములుగు జిల్లా కలెక్టర్ ములుగు జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలోనేల కిందటే వాళ్లకి యూనిట్లు మంజూరు చేసి లబ్ధి చేకూర్చడం జరిగింది. కానీ అదే ఎమ్మెల్యే లెటర్ ప్రింట్ పై ఈ మూడు మండలాలకు సంబంధించిన 60 మంది లబ్ధిదారుల పేర్లు కూడా జిల్లా ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. కానీ కొత్తగూడెం జిల్లా కలెక్టర్, జిల్లా ఇన్చార్జి మంత్రి పువ్వాడ అజయ్ ఈ 60 మంది లబ్ధిదారులకు సంబంధించి యూనిట్లను మంజూరు చేయడంలో ఎందుకు ఆలోచిస్తున్నారు దళిత బంధు లబ్ధిదారుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేపు జరగబోయే ఐటీడీఏ పాలకమండలి సమావేశం కు వస్తున్న జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్ ఇంకా ఇతర ఉన్నత అధికారులు అందరూ ఒకే వేదికపై అందుబాటులో ఉంటారు కాబట్టి మా 60 మంది దళిత బందు లబ్ధిదారులకు సరైన న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము అని తెలిపారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు, దళిత బంధు లబ్ధిదారుల నాయకులు పిలక వెంకటరమణారెడ్డి వెంకయ్య చౌదరి గుమ్మడి శ్రీను కోడి సంటి సమ్మయ్య సంగీతరావు జిలకర వెంకటేశ్వరరావు వెంకటలక్ష్మి సంధ్య తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: