మన్యం టీవీ దుమ్ముగూడెం ::
అరకొర పనులతో నాసిరకంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పైకప్పు నుంచి వర్షం కురుస్తున్న వైనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నిర్మించడం వల్ల దుమ్ముగూడెం మండలంలోని పలు ప్రాంతాలలో నిర్మించిన ఇల్లు పైకప్పులు, పెచ్చులు ఊడి ఇళ్లల్లో వర్షం నీరు వస్తుంది దుమ్ముగూడెం మండలంలోని ప్రగళ్లపల్లి పంచాయతీకి చెందిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేశవపట్నం గ్రామంలో నిర్మించిన 25 డబల్ బెడ్ రూమ్ బైరాగులపాడు,రామచంద్రపురం, రాయి గట్ట, కే. వీరభద్రాపురం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కేటాయించారు అయితే గత వారం రోజులుగా కురుస్తున్న చిన్న పాటి వర్షాలకే పైకప్పు ఇట్టి విషయాన్ని అధికారులకు చెప్పిన స్పందించడం లేదని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని మరమ్మతు పనులు చేపట్టాలని బాధితులు కోరారు. అలానే దుమ్ముగూడెం గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల లబ్ధిదారులకు అందకతోలే బిల్డింగ్ పగుళ్లు, ఫ్లోరింగ్ కిందకు దిగిపోవడం జరిగిందని లబ్ధిదారులు తెలియజేశారు. ఫిర్యాదు చేసిన వారిలో కల్లూరి చిన్నక్క మడివి రమేష్ కాకరాజు కారం నరసింహారావు శ్రీను తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: