మన్యం మనుగడ, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం చేగర్షల గ్రామానికి చెందిన కొందరు అడవిలోని విషపూరిత గడ్డ ఇంటికి తీసుకొని వచ్చి, తినడం జరిగింది. తిన్న కొద్దిసేపటికే వారు అస్వస్థతకు గురి కావడంతో వెంటనే వారిని మణుగూరులోని వంద పడుకల ప్రభుత్వ ఆసుపత్రి కి వారి బంధువులు తరలించారు. కాగా 70 సంవత్సరాల వయసు గల బత్తుల సీతమ్మ విష ప్రభావం వలన మృతి చెందింది. ఎస్.కె నసార్ సాహెబ్, షేక్ ఫాతిమా బీ, కుమ్మరికుంట్ల లక్ష్మి, బెల్లంకొండ నాగలక్ష్మి, బొల్లా నరేష్ ,చింతల ముత్తమ్మ లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారు.
Post A Comment: