జూలూరుపాడు జులై 1, (మన్యం మనుగడ) ప్రతినిధి, శుక్రవారం జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో జరిగిన బి ఎస్ పి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో
వైరా నియోజకవర్గ అధ్యక్షులు బానోత్ రాంబాబు మరియు వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ నారపోగు ఉదయ్ వారియర్స్ ఆధ్వర్యంలో
బిఎస్పి పార్టీ కండువా కప్పుకున్నారు. అంబేద్కర్ యువసేన సంఘం జూలూరుపాడు మండల అధ్యక్షులు మంద కృష్ణ
తో పాటుగా మరో 15 మంది పార్టీలో చేరారు. అంబేద్కర్ యువసేన సంఘాన్ని బీఎస్పీ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మందకృష్ణ మాట్లాడుతూ.. ఇన్నాళ్లు అందరి పార్టీల జెండాలు మా భుజాలపై మోసామని ఈ రోజు నుంచి కాన్సిరాం చూపిన బాటలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో సాగుతామని ఆయన తెలిపారు.
Post A Comment: