జూలూరుపాడు జులై 01, (మన్యం మనుగడ) ప్రతినిధి, మండల పరిధిలోని గ్రామాలలో వరుస దొంగతనాలతో మండల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మనుషులు లేని, తాళాలు ఏసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసి చేతివాటం చూపుతున్నారు. మొన్న నర్సాపురం లోనీ బాదావత్ లక్ష్మి అనే మహిళ తాళం వేసి పొలం పనులకు పొగ, తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. నేడు మండలపరిధిలోని పాపకొల్లు గ్రామంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయి తాళం వేసి వున్న ఇంటిని టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడ్డారు. అందిన కాడికి బంగారం, వెండి, నగదు చోరి చేసి ఉడాయించారు. వివరాల్లోకెళ్తే పాపకొల్లు గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు పూసల శ్రీనివాసచారి తన భార్యతో కలసి దైవదర్శనం కోసం తిరుపతి వెళ్లారు. ఇదే అదునుగా గుర్తుతెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి ఇంటి వెనకాల తలుపులు పగలగొట్టి ఇంట్లో కి ప్రవేశించి బీరువాలోని 25 వేల రూపాయలు నగదు, చెవు దిద్దులు, వెండి వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు.ఇంటి ముందు ఉన్న మెడికల్ షాప్ యజమాని తలుపులు తెరుచుకొని ఉండటాన్ని గమనించి, కాకర్ల గ్రామంలో ఉంటున్న. వైద్యుడు కుమార్తె అల్లుడికి. సమాచారం అందించారు.
వెంటనే. వారు ఇంట్లోకి వచ్చి చూడగా బీరువాలోని బట్టలు సామాగ్రి చెల్లా చెదురుగా పడి ఉండటం గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన స్థానిక ఎస్ఐ పోటు గణేష్ కేసు నమోదు చేసుకొని సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Post A Comment: