మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల తహసిల్దార్ కార్యాలయంలోని విఆర్ఏలు తహసిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిరవధిక సమ్మెను చేయడం జరిగింది. అసెంబ్లీలో ప్రకటించిన విధంగా తమకు పే స్కేలు వేతనం ప్రకటించాలని, వయసు పైబడిన వీఆర్ఏలకు వారసత్వ ఉద్యోగాలు కల్పించే విధంగా కృషి చేయాలని వీఆర్ఏలు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల తహసిల్దార్ కార్యాలయాలలో నిరవధిక సమ్మె చేస్తున్నామని, ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి మేము వ్యతిరేకం కాదని, ఇచ్చిన హామీలు నెరవేర్చి వీఆర్ఏల మనుగడ ప్రశ్నార్థకం కాకుండా చేయాలని,దీనికి అంగీకారం తెలంగాణ ప్రభుత్వం తెలిపినట్లైతే సమ్మెను విరమిస్తామని, తెలియజేశారు. ఈ నిరసనకు పినపాక మండల గిర్ధావర్ బాలకృష్ణ, మండల వీఆర్వోల సంఘం అధ్యక్షుడు వై సత్యనారాయణ లు తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండలం వీఆర్ఏల అధ్యక్షుడు కొండయ్య, నరసింహారావు, రోశయ్య, జగదీష్, చందర్ రావు, రమణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: