గుండాల జూలై 25(మన్యం మనుగడ) వీఆర్ఏల సమస్యలను తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించాలని వీఆర్ఏల సంఘం అధ్యక్ష కార్యదర్శులు వట్టం సారయ్య, గుర్రం శివాజీలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చిన ప్రకారం పేస్కేల్, పెన్షన్ తో పాటు వారసత్వ ఉద్యోగ అవకాశాలను తక్షణమే అమలు పరిపాలన వారు అన్నారు. సోమవారం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ తమకు హామీలు నెరవేరేంతవరకు విధులకు హాజరయ్యే లేదని వారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ స్పందించి తమ కోర్కెలు నెరవేర్చాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు సారయ్య, శేఖర్, స్వరూప, నరసమ్మ లు పాల్గొన్నారు
Navigation
Post A Comment: