మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని గోదావరి వరద ముంపు గురైనటువంటి బాధితులకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు బండారుగూడెం
వైట్ నాగారం, తూరుబాక గ్రామాల్లో 400 కుటుంబాలకు తెరాస రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జి,తెల్లం వెంకట్రావు అందించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ, ప్రభుత్వం ముంపు ప్రాంత బాధితులను ఆదుకుంటుందని,ఎవరు అదేర్యపడవద్దు అని ,ప్రభుత్వం ప్రజలు సమస్యలు తీర్చేందుకు పని చేస్తుంది అని, గోదావరికి ముంపునకు గురైన ప్రతి ఇంటికి 10 వేలు సహాయం అందిస్తుంది అని అన్నారు. మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ట్రస్ట్ నుండి కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణ మూర్తి,ప్రధాన కార్యదర్శి కణితి రాముడు,జడ్పీటీసీ తెల్లం సీతమ్మ,ఎంపీపీ రేసు లక్ష్మీ,మండల ఉపాధ్యక్షులు తునికి కామేశ్వరరావు, ప్రచార కార్యదర్శి తోట రమేష్,సొసైటీ డైరెక్టర్ బొల్లి వెంకట్రావు,ఎంపీటీసీలు మడకం రామారావు,సోడి తిరుపతిరావు, శ్రీకాంత్, జానీ పాషా, శేఖర్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: