గుండాల జూలై 5(మన్యం మనుగడ) ప్రజలు టిబి పై అవగాహన కలిగి ఉండాలని టీబీ జిల్లా అధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆశ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు ప్రజలకు టిబీ పై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలని వారినుఆదేశించారు. టీబీ వ్యాధి లక్షణాలు చికిత్స గురించి ఆశా కార్యకర్తలకు వివరించారు. ఆసుపత్రిలోని రికార్డులు అన్నిటిని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల వైద్యులు రవిచంద్, సిబ్బంది శ్రీహరి, పద్మ, కృష్ణయ్య, ముత్యాలరావు, శ్రావణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: