గుండాల/ఆళ్లపల్లి జూలై 5(మన్యం మనుగడ) రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని ఏవో అశోక్ రైతులకు సూచించారు. మంగళవారం మండలం పరిధిలోని మార్కోడు గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 1001 రకం వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. సన్నారకం వరి వేయాలని ఆయన అన్నారు. డీఏపీ ఎక్కువ వాడకూడదని ఆయన అన్నారు. ఎరువులన్నీ అందుబాటులో ఉన్నాయని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్ బాబు, రైతులు తాళ్లపల్లి వెంకన్న, నరసింహులు, శ్రవణ్, సందీప్, రవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: