గుండాల జూలై 5(మన్యం మనుగడ) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించినందుకు ఘనంగా సన్మానించారు. అనంతరం గుండాల సర్పంచ్ కోరం సీతారాములు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించినందుకు మీకు ప్రత్యేక అభినందనలని ఆయన అన్నారు. మునుముందు మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపిటిసి ఎస్కే సందాని, కళాశాల ప్రిన్సిపల్ నవీన జ్యోతి, కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: