CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టిబిజీకేయస్ గౌరవ అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కల్వకుంట్ల.కవిత పై చేసిన వ్యాఖ్యలు నిరూపించకపోతే వాసిరెడ్డి సీత రామయ్య కార్మిక వర్గం ఎదుట ముక్క నేలకు రాయాలి.

Share it:

      


  • మణుగూరు టిబిజీకేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి.ప్రభాకర రావు                                         


మన్యం టీవీ మణుగూరు:


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అనంతరం సింగరేణి లో గుర్తింపు కార్మిక సంఘము గా టిబిజీకేయస్ గెలిచిన తర్వాత టిబిజీకేయస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో సింగరేణి లో వివిధ నోటిఫికేషన్ల ద్వారా నూతన ఉద్యోగాలు సాధించడం,కార్మికులకు అనేక సంక్షేమ అభివృద్ధి హక్కుల సాధనతో టిబిజీకేయస్ జెట్ స్పీడ్ వేగంతో దూసుకపోతుంటే,చూసి ఓర్వలేని ఏఐటీయూసి నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య శ్రీరాంపూర్ ఏరియా సమావేశంలో టిబిజీకేయస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల.కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని ఎంతో సాధన చేసి, పోటీతత్వం ఎదుర్కొని క్లరికల్ పోస్ట్ సాధిస్తే వారిని కించపరుస్తూ,వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిన వాసిరెడ్డి సీత రామయ్య చేసిన వ్యాఖ్యలు నిరూపణ చేయాలని లేని యెడల కార్మిక వర్గం ఎదుట ముక్కు నేలకు రాయాలని టిబిజీకేయస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల.కవిత క్లరికల్ ఉద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని మణుగూరు టిబిజీకేయస్ బ్రాంచి ఉపాధ్యక్షలు వూకంటి.ప్రభాకర రావు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు జయశంకర్ సార్ టిబిజీకేయస్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.గోరంత సేవ చేసి కొండంత దోపిడీ చేసిన చరిత్ర ఏఐటీయూసీ కార్మిక సంఘానిదని అటువంటి దోపిడి కార్మిక సంఘము నేడు క్లరికల్ పోస్ట్ లో అవినీతి జరిగిందంటూ నిస్వార్థంగా కార్మిక వర్గానికి సేవలు అందిస్తున్న కల్వకుంట్ల.కవిత పై మాట్లాడటం వారి అవివేకనికి నిదర్శనం అన్నారు.గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో లబ్ది పొందాలనే దురలోచనతో కార్మిక వర్గాన్ని తప్పు దోవ పట్టించడానికి పసలేని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.సింగరేణి లో ఘరానా మోసగాళ్ళు ఏఐటీయూసీ నాయకులేనన్న విషయం కార్మిక వర్గానికి తెలుసని ఆయన తెలిపారు. కార్మిక వర్గం ముందు ఏఐటీయూసీ నాయకులు ఎన్ని పిల్లి మొగ్గలు వేసిన కార్మిక సంక్షేమ వారధిగా ఉన్న టిబిజీకేయస్ ను అడ్డుకోలేరని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

Share it:

TS

Post A Comment: