మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని రైతు వేదికలో వర్షాకాలానికి సంబంధించి వరదల పట్ల తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలపై సమావేశము మండల తహసిల్దార్ విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పినపాక మండలంలో పలు ముంపు ప్రాంతాలు ఉన్నాయని, జాగ్రత్త చర్యలు అనుసరించి, వరదల తాకిడికి ప్రజలు బాధపడకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి,ఆ గ్రామ ప్రజానీకానికి తగు సలహాలను ఇవ్వాలని కోరారు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు,గ్రామపంచాయతీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి నరసింహారావు, వివిధ పంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు.
Post A Comment: