CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముంపు బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ.

Share it:

 


మన్యం మనుగడ/వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెద్దగొల్లగూడెం గ్రామంలో గోదావరి ముంపునకు గురి అయిన కుటుంబాలను గుర్తించి వాజేడు మండల టీఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో స్థానిక సర్పంచ్ జజ్జరి మేనక, ఎంపిటిసి బీరబోయిన పార్వతి దాతలు మాజీ ఎంపిపి గొంది స్వరూప ఆర్ కే ఇండస్ట్రీస్ విలాసారపు రామకృష్ణ, డాక్టర్ రత్నశంఖర్ ఆర్థిక సహకారం తో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎక్స్ ఎమ్మేల్సీ బాలాసాని లక్ష్మినారాయణ గారు భద్రాచలం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు, వెంకటాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొదెబోయిన బుచ్చయ్య,ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడె నాగజ్యోతి పాల్గోని ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.  

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బాలస లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, గోదావరి ముంపు గ్రామాల ప్రజలకు అండగా టిఆర్ఎస్ పార్టీ ఉంటుందని, దాతల సహకారం మరువలేనిదని అన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణారెడ్డి, జడ్పీటిసి తల్లడి పుష్పలత, ఎం పి పి శ్యామల శారద, ఎంపిటిసి లు పంచాయతీ సర్పంచులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: