మన్యం మనుగడ, అశ్వారావుపేట: ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా అదేశానుసారం అశ్వరావుపేట మండలం పేరాయి గూడెం గ్రామంలోని యువతకు తెరాస పార్టీ సీనియర్ నాయకులు కాసాని చంద్ర మోహన్ సహకారంతో వాలీబాల్, సామాగ్రిని మెచ్చా యువసేన అధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువత ఐటీ రంగంలో, క్రీడ రంగంతో పాటు ఇతర అనేక రంగాల్లో ప్రాధాన్యత సంతరించుకొనే విధంగా మంత్రి కేటీఆర్ యువతను ప్రోత్సహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ డైరెక్టర్ కలపాల బాబురావు, గ్రామ కమిటీ అధ్యక్షులు చిప్పనపల్లి బాజారయ్య, నార్లపాటీ శుదర్షన్ గారి చేతులమీదుగా యువతకు క్రీడ సామాగ్రిని అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కలపాల శ్రీనివాస రావు, చిప్పనపల్లి శ్రీను గంధం ఆనంద్, తగరం హరి, నార్లపాటి అనిల్, ప్రదీప్, ప్రసన్న బాబు, సంతోష్, రామకృష్ణ, ఉదయ్, దావీదు, తడికమల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: