మన్యం మనుగడ,పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డిపల్లి పంచాయతీలోని సింగిరెడ్డిపల్లి గ్రామస్తులు ఆదివారం నాడు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. ఇటీవలన గోదావరి కి వచ్చిన వరదల కారణంగా సింగిరెడ్డిపల్లి గ్రామం వరదలకు గురైన విషయము అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని రేగా కాంతారావుకు తెలియజేస్తూ, తమ గ్రామానికి వరదలపరంగా పరిష్కారం చూపించాలని, ప్రతి సంవత్సరము వరద కారణంగా రహదారులు స్తంభించిపోతున్నాయని, వరద ముంపునకు గురికాకుండా గ్రామంలోని ప్రజానీకానికి గృహ నిర్మాణాల కోసం స్థలం కేటాయించాలని,సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభమైతే మరింత ఇబ్బంది పడే అవకాశం ఉందని,వరదలు వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడవలసి వస్తుందని,కావున తమ గ్రామం యందు దయవుంచి శాశ్వత పరిష్కారం చూపించాలని నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను సింగిరెడ్డిపల్లి గ్రామస్తులు కోరినారు.ఈ విషయం గురించి సానుకూలంగా స్పందించిన రేగా కాంతారావుకు సింగిరెడ్డిపల్లి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డిపల్లి ఉపసర్పంచ్ పొనగంటి వెంకటేశ్వర్లు,గ్రామస్తులు వడ్లకొండ శ్రీను, బొడ్డు హరిబాబు, చిన్నారి,కిషోర్, రొట్ట సాంబయ్య, ప్రదీప్, ప్రవీణ్, సాయిరి రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: