మన్యం మనుగడ కరకగూడెం: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గోదావరి ముంపు ప్రాంతం వరద బాధితులు అందరికీ వెంటనే నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.అలాగే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన 10 వేల రూపాయలు తక్షణమే బాధితులకు అందించాలి అని అన్నారు.అదేవిధంగా లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మెట్ట ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లను నిర్మించి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ గారు,మండల కార్యదర్శి షేక్ రఫీ గారు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: