మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటీవల వరద ముంపు కు గురైన అశ్వాపురం మండలం నెల్లి పాక గ్రామాన్ని వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డెరైక్టర్ డాక్టర్ అమర్ సింగ్ సందర్శించారు. గ్రామాల్లో పర్యటించి వరద బాధితుల తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ముంపు గ్రామాల ప్రజలు కాచి చల్లార్చి న నీరు తాగాలన్నరు. బలమైన పోషకాహారం తీసుకోవాలని బయటి ఆహార పదార్థాలు తినవద్దు అన్నారు. ఇంటి చుట్టూ ప్రక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వరద ముంపు గ్రామాల్లో దోమల మందు పిచికారి చేస్తున్నామని అందరూ ఇండ్లల్లో మందు పిచికారి చేయించు కోవలన్నారు . ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి డాక్టర్ శిరీష, మండల వైద్యాధికారి మణీకంఠా రెడ్డి, సర్పంచ్ వెంకటరమణ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: