CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ద్విచక్ర వాహనంపై 17,982 కిలోమీటర్ల యాత్ర చేసిన యువకులు.ఘనంగా ఆహ్వానం పలికిన మిత్రబృందం

Share it:


గుండాల జులై 21(మన్యం మనుగడ) మండల కేంద్రానికి చెందిన బత్తిని వినయ్, బత్తిని విక్రమ్ 17,982 కిలోమీటర్లు సుదీర్ఘ భారతదేశ యాత్ర చేశారు మొత్తం మొత్తం 26 రోజులపాటు ద్విచక్ర వాహనంపై అతి ఎత్తైన లడక్ వరకు వెళ్లి తిరిగి వచ్చారు. 26 రోజులపాటు ద్విచక్ర వాహనం పై ప్రయాణం చేస్తూ తమ విహారయాత్రను చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. చైనా, భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని ఆర్మీ బేస్ క్యాంపులో బస చేసామని జవాన్లు ఎంతో ఆప్యాయంగా పలకరించి భోజన సదుపాయాన్ని సైతం ఏర్పాటు చేశారని వారు పేర్కొన్నారు. సుదీర్ఘ భారత దేశ యాత్ర చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని భక్తిని బ్రదర్స్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రానికి వచ్చిన వారికి వారి మిత్ర బృందం ఘనంగా స్వాగతం పలికింది. త్వరలో మరికొన్ని భారతదేశ యాత్రలను ద్విచక్రం పైన వెళ్తామని వారు పేర్కొన్నారు


Share it:

TS

Post A Comment: