మన్యం మనుగడ కరకగూడెం:టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా గొల్లగూడెం గ్రామానికి చెందిన పాలకుర్తి వినోద్ కుమార్ ఏన్నికయ్యారు,ఈ ఎన్నిక నియామక పత్రన్ని మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ పార్టీ కార్యలయం నందు నియామకపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని,టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తానని, టీఆర్ఎస్ పార్టీ కొసం అహర్నిశలు నా వంతు సహాయం చేస్తానని తెలిపారు.తనపై నమ్మకం ఉంచి పదవి అప్పగించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కి,మండల నాయకులు,ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి రేగా.కాళికా,మహిళా మండల అధ్యక్షురాలు కాసు.లావణ్య, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు జాడి.రామనాథం,యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల.రంజీత్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: