మన్యం మనుగడ ప్రతినిధి: ములకలపల్లి : మండల పరిధిలోని ముత్యాలంపాడు గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎంపీటీసీ మడకం విజయ పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు గోడలకు చెమ్మ రావడంతో ఎంపిటిసి మడకం విజయ స్థానిక ఏఇ సుబ్బరాజు కాంట్రాక్టర్ కృష్ణారావు కు తెలియజేశారు.దీనికి స్పందించిన అధికారులు సదరు కాంట్రాక్టర్ సమస్యను అర్థం చేసుకొని డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఖరీదైన పెయింట్ వేయించి గోడలకు చెమ్మ రాకుండా చేసారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వెంటనే పరిష్కరించిన ఏఈ సుబ్బరాజు, కాంట్రాక్టర్ కృష్ణారావుకు ఎంపీటీసీ మడకం విజయ, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల యజమానులు కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: