మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలో భారీ వర్షాల వలన గోదావరి ముంపుకు గురవుతున్నటువంటి ప్రగళ్ళపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సున్నం బట్టి గ్రామస్తులను మంగువాయబాడవ ఆశ్రమ పాఠశాలకు పునరావాస కేంద్రాలలో తరలించరు వీరికి ఎలమంచి సీతారామయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 100 మందికి అల్పాహారం పంపిణి చేసారు . ఈ సందర్భంగా సిపిఎం పార్టీ దుమ్మగూడెం మండల కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ ముంపు ప్రాంతాలకు ప్రభుత్వం, అధికారులు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని ముంపు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అధికారులు చెప్పిన పద్ధతి ప్రకారం పునరావాస కేంద్రాలకు రావాలి అని కోరారు. అలానే దుమ్ముగూడెం గ్రామం చెందిన కొండప్రాంత గ్రామస్తులను దుమ్మగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజీ దగ్గరకు తరలించరు అని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చంద్రయ్య, చిలకమ్మా, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు సొసైటీ డైరెక్టర్ ఎలమంచి శ్రీను బాబు, స్థానిక సర్పంచ్ యం రాజేష్, పార్టీ నాయకులు తేల్లం ధర్మయ్య, కల్లూరి లక్ష్మయ్య, వార్డ్ మెంబర్ బైరెడ్డి సతీష్, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: