CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గోదావరి ఉధృతి పెరుగుతుండడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు..ఇంటింటికి తిరిగి వరద పరిస్థితిని వివరించిన జడ్పిటిసి ఎంపిపి..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

దుమ్ముగూడెం మండలం లో గోదావరి నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండడంతో గోదావరి పరివాహ ప్రాంతాలైన సున్నం బట్టి, ఎస్ కొత్తగూడెం, పర్ణశాల, దుమ్ముగూడెం, గంగోలు గ్రామాల ప్రజలను అధికారులు రాజకీయ నాయకులు ఆధ్వర్యంలో పునరవస కేంద్రాలకు తరలించారు. కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు గోదావరి ఉధృతి 65 అడుగులు మించి ప్రమాద స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నందున ఆయా గ్రామాల ప్రజలకు తెలియజేసి పునరావస కేంద్రాలకు తరలించే పనులు మండల అధికారులు నిమగ్నమయ్యారు. సున్నం బట్టి ఎస్ కొత్తగూడెం గ్రామ ప్రజలను మంగువాయిబడవ ఆశ్రమ పాఠశాలకు, పర్ణశాల గ్రామస్తులను సీతానగరం గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి, గంగోలు గ్రామంలో ఉన్న 45 డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులను కే రేగుపల్లి ఆశ్రమ పాఠశాలకు తరలించారు. దుమ్ముగూడెం పోలీస్ సిఐ దోమలు రమేష్ ఆధ్వర్యంలో తురుబక, పర్ణశాల గ్రామాల వద్ద బారికేడ్లు వేసి పటిష్ట బందోబస్తు నిర్వహించి రాకపోకలు నిలిపివేశారు. ఎస్ కొత్తగూడెం గ్రామంలో అధికారులు, జడ్పిటిసి, ఎంపీపీ గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులు వరద పరిస్థితులు వివరించి ఇంటింటికి తిరిగి వారిని సురక్షిత ప్రాంతాలకు రావాలని నచ్చ చెప్పారు. అలానే మండలంలోని పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి వాగులు చేపలు వేటకు వెళ్ళొద్దని ఎటువంటి సహాయం కావాలన్నా అధికారులు దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో చంద్రమౌళి, దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్, సిఆర్పిఎఫ్ డిఎస్పి రేవతి, ఎస్సై రవికుమార్, కేశవరావు, ఎంపీఓ ముత్యాలరావు, జెడ్పిటిసి తెల్లం సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మి, సర్పంచ్ వరలక్ష్మి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యాలు, కార్యదర్శి రాముడు, పార్టీ నాయకులు కామేశ్వరరావు, జానీ పాషా, ఎంపీటీసీ రామారావు, కార్యదర్శులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: