CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వరద బాధిత పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట కెవిఆర్ ఫంక్షన్ హాల్ నందు వరద బాధిత పునరావాస కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బాధితులకు ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.భారీ వర్షాలు కురుస్తున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రా వద్దని సూచించారు.ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: