మన్యం టీవీ దుమ్ముగూడెం:
మండలంలోని గోదావరి ముంపు ప్రదేశమైన పర్ణశాల గ్రామాన్ని భద్రాచలం ఏ ఎస్పి రోహిత్ రాజు సందర్శించారు. జిల్లా కలెక్టర్ ఆదేశానసరం ఈరోజు రాత్రి లోగా గోదావరి నీటిమట్టం 65 అడుగులు ప్రమాదా హెచ్చరిక దాటి ప్రవహిస్తుందని వరద ఉదిత్తి తీవ్రత కావడంతో ముంపు ప్రభావిత పరివాహ ప్రజలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. పర్ణశాల గ్రామంలో గ్రామస్తులను దగ్గరుండి వారికి కేటాయించిన పునరావస కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో చంద్రమౌళి మాట్లాడి ఈ గ్రామాల్లో వరద ఉదిత్తి వలన ఇబ్బంది ఉందో తెలిపి పోలీసు అధికారుల సహాయం తీసుకోవాలని కోరారు. ఆయన వెంట దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్, స్పెషల్ డ్యూటీ సీఐ ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్సై కేశవరావు, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: