మన్యం మనుగడ ఏటూరు నాగారం
స్థానికులతో మాట్లాడుతూ. ఆందోళన వద్దు అన్ని విధాల ఆదుకుంటాం అన్నారు
మేడారంలో అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలలో మరమ్మత్తులకు చర్యలు మరియు నష్టపోయిన కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని ప్రజలు ఆందోళన చెందవద్దని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అన్నారు.గురువారం రోజున ఆయన మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మ వార్లను దర్శించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు సద్దు మనిగి సాదారణ పరిస్థితులు నెలకొనాలని ధన,ప్రాణ నష్టం వాటిల్లకుండా కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తాడ్వాయి మండల తహశీల్దార్, ఎంపిడిఓ , స్థానిక జడ్పిటిసి , స్థానిక సర్పంచ్ లతో కలిసి జంపన్న వాగును పరిశీలించారు.అనంతం మేడారం నుండి ఊరట్టం వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ఆ రోడ్డును పరిశీలించి జంపన్నవాగులో ఇసుక మేటల మూలంగా కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించి వెంటనే యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఇసుక మేటలు తొలగించేవిధంగా చూడాలని స్థానిక తహశీల్దార్ కు సూచించారు,స్థానిక సర్పంచ్ కోరిక మేరకు దెబ్బతిన్న వంతెనల నిర్మాణానికి ఆర్ అండ్ బి అధికారులచే తనకు నివేదికలు సమర్పించాలని శాశ్వత పరిష్కారం చూపుతానని వారికి హామి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి,సీనియర్ నాయకులు గోవిందు నాయక్, స్థానిక మండల అధ్యక్షుడు రమేష్ ,ఆత్మ చైర్మన్ దుర్గం రమణ ఇంద్రారెడ్డి, మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ శివయ్య,జగ్గారావు,స్వరూప,బండారు చంద్రయ్య,ఆది రెడ్డి, మోహన్,బల్గూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: