- ఆదివాసీ సేన ములుగు జిల్లా కన్వీనర్ మడి సాయిబాబా
మన్యం మనుగడ,మంగపేట.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపాశగూడెం అధివాసులపై అటవీశాఖ అధికారులు పోలీస్ శాఖ సహకారంతో దాడి చేయడాన్ని ఆదివాసీ సేన తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని ములుగు జిల్లా కన్వీనర్ మడి సాయిబాబా అన్నారు. శనివారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధివాసులపై దాడి చేసిన అధికారులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అధివాసులపై దాడులను ఆపాలని అన్నారు. లేనిపక్షంలో ఆదివాసీ సేన ఆధ్వర్యంలో పోడు పోరు ను రాష్ట్రవ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చట్టం ప్రకారం పని చేయాలని అక్కడ ఉండే ఆదివాసుల చట్టం ప్రకారంగా పని చేస్తుంటే 5వ షెడ్యూల్ చట్టాలను, రాజ్యాంగాన్ని ధిక్కరించి పని చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన మండల అధ్యక్షుడు పోలేబొయిన ఆదినారాయణ, కార్యదర్శి కల్తీ రామకృష్ణ, కురుసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: