మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలంలోని కోమటి పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుబ్బాక ఎల్లయ్య ఇటీవల మరణించిన నేపద్యంలో శనివారం ఆయన దశదిన కర్మలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దుబ్బాక ఎల్లయ్య మరణం తో కాంగ్రెస్ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది, అతని లోటు తీర్చలేనిది అని విచారం వ్యక్తం చేశారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి, జాతీయ మిర్చి టాస్క్ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, బ్లాక్ ఉపాధ్యక్షుడు లక్కీ వెంకన్న, యూత్ జిల్లా కార్యదర్శి మంగపేట మండల మీడియా ఇంచార్జ్ కర్రీ నాగేంద్రబాబు, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చౌలం వెంకన్న, సీనియర్ నాయకులు నాసిరెడ్డి నాగిరెడ్డి, మైనుద్దీన్, దామేర సారయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: