మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని వీధులలో కాలినడకన తిరుగుతూ,ప్రతి ఒక్కరిని పలకరించారు,వారి సమస్యలను,యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తానని,ఆయన స్థానిక ప్రజలకు తెలియజేశారు.పలు ప్రాంతాలలో క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులను తగు సలహాలు, సూచనలు చేశారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,మున్సిపల్ కమిషనర్ మాధవి,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,కార్యదర్శి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,కార్యదర్శి రవి ప్రసాద్, మండల యూత్ అధ్యక్షులు హర్ష నాయుడు,పట్టణ యూత్ అధ్యక్షులు రుద్ర వెంకట్, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,స్థానిక కార్యకర్తలు, యువజన నాయకులు, టిఆరేస్వి నాయకులు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: